Back to feed
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు పిల్లలు సహా 31 మంది మృతి
Priya Singh May 27, 2026 6:35 AM అల్ ఇండియా 7 viewsabout 13 hours ago

పశ్చిమాసియాలో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో చిన్నారులతో సహా కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
హెజ్బొల్లా జరిపిన రాకెట్ దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. మరోవైపు, ఇజ్రాయెల్ దళాలను తాము సమర్థవంతంగా ఎదుర్కొని వెనక్కి తరిమికొట్టామని, డ్రోన్లు, రాకెట్లతో ప్రతీకార దాడులు చేశామని హిజ్బుల్లా ప్రకటించింది.
Comments
Loading comments...

