వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడంపై అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్పై పాక్ సుదీర్ఘకాలంగా విద్వేషం ప్రదర్శిస్తోందని, 'అబ్రహాం ఒప్పందాల'ను ఆ దేశం తోసిపుచ్చడం ఆందోళనకరమని ఆయన విమర్శించారు.
మరోవైపు, అమెరికాతో ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ తన సైనిక విమానాలను పాక్ ఎయిర్బేస్లలో పార్క్ చేసిందనే వార్తలను తోసిపుచ్చలేమని లిండ్సే పేర్కొన్నారు. అబ్రహాం ఒప్పందాలపై ట్రంప్ ఇచ్చిన పిలుపునకు పాక్ వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

