వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రంలో రాబోయే ఐదేళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్వల్ప దూర ప్రయాణాల కోసం దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెస్తారు. 130 కి.మీ వేగంతో నడిచే ఈ రైళ్లలో 20 కోచ్లు ఉంటాయి.
ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్ వంటి ఆధునిక వసతులతో ఇవి రూపుదిద్దుకోనున్నాయి. ఈ సౌకర్యవంతమైన, సరసమైన రైళ్ల వల్ల రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గి, పర్యావరణహిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

