Back to feed
ఇంటర్ పరీక్ష ఫలితాల కలకలం: విద్యార్థిని ఆత్మహత్య
Anjali Jun 13, 2026 6:04 AM గద్వాల 12 views2 days ago

గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూర్లో ఇంటర్ ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో చామంతి (17) అనే విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సప్లిమెంటరీ ఫలితాల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ కావడంతోనే ఈ ఘోరం జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు.
కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువులో విఫలమయ్యాననే ఒత్తిడితో యువతి ప్రాణాలు తీసుకోవడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.
Comments
Loading comments...



