Back to feed
అమల్లోకి వచ్చిన భారత్-ఒమన్ ఆర్థిక ఒప్పందం
Priya Desai Jun 01, 2026 10:17 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago

భారత్-ఒమన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం వల్ల రెండు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఈ ఒప్పందంతో భారతదేశ ఎగుమతుల్లో సుమారు 99.38 శాతానికి ఒమన్లో వంద శాతం సుంకం లేని మార్కెట్ ప్రవేశం లభిస్తుంది. ఇది మన దేశీయ ఎగుమతులు పెరగడానికి, ఉపాధి అవకాశాల సృష్టికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...



