వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణ తదుపరి దశలో భారత్ అగ్రగామిగా నిలిచే బలమైన అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ జై పారిఖ్ స్పష్టం చేశారు. మనదేశంలో ఉన్న అపారమైన డెవలపర్ బేస్, కంపెనీలు వేగంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఇందుకు ప్రధాన కారణాలని ఆయన విశ్లేషించారు.
అంతర్జాతీయ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులలో భారత డెవలపర్లు రెండో స్థానంలో దూసుకుపోతున్నారు. దేశీయంగా ఉన్న ఆధార్, యూపీఐ వంటి పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు ఏఐ రంగంలో భారత్ సాధించబోయే అద్భుత ప్రగతికి బలమైన పునాదులుగా మారనున్నాయని పారిఖ్ కొనియాడారు.
Comments
Loading comments...

