Back to feed
భారత్-కెనడా వాణిజ్య ఒప్పందం: వ్యాపారాలు మారనున్నాయా?
Vikram Chandra May 27, 2026 7:02 AM అల్ ఇండియా 5 viewsabout 13 hours ago

ఈ ఏడాది చివరికల్లా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలను ముగించాలని భారత్, కెనడా భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 17 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, 2030 నాటికి మూడు రెట్లు పెంచి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే ఇరు దేశాల ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో గోయల్ సమావేశమయ్యారు. ఈ ఒప్పందం ఇరు దేశాల కార్మికులకు, వ్యాపారాలకు గేమ్ ఛేంజర్గా మారుతుందని కార్నీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒట్టావాలో ఈ అంశంపై మూడో రౌండ్ చర్చలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...



