Back to feed
పర్యాటక కేంద్రాల్లో పెరిగిన బోటింగ్ ఆదాయం
Ravi Jun 11, 2026 6:04 AM ఖమ్మం 7 views4 days ago

వేసవి సెలవుల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా కిన్నెరసాని రిజర్వాయర్, లకారం ట్యాంక్ బండ్ లలో బోటింగ్ చేయడానికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపించారు.
ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కిన్నెరసానిలో బోటింగ్ ద్వారా సుమారు రూ.3.94 లక్షలు, లకారంలో రూ.2.10 లక్షల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పర్యాటక శాఖకు రెట్టింపు రాబడి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...



