Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపు

Anita Joshi Jun 04, 2026 6:57 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
 తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపు - Udayam Digital
రాష్ట్రంలో భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువను ప్రభుత్వం పెంచింది. ఈ కొత్త ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి రానున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1200 కోట్ల అదనపు రాబడి రానుండగా, కొనుగోలుదారులపై రిజిస్ట్రేషన్ భారపడనుంది. వ్యవసాయ భూముల కనీస ధర ఎకరాకు రూ.2.75 లక్షలు, గ్రేటర్ పరిధిలో రూ.15 లక్షలుగా ఖరారు చేశారు. గరిష్ఠంగా ఖాజాగూడలో ఎకరం రూ.30 కోట్లుగా నిర్ణయించారు. గజం కనీస ధర గ్రామాలవారీగా రూ.600 నుండి HMDA పరిధిలో రూ.2,000 వరకు పెంచారు.

Comments

G
Loading comments...