Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగు భూమిలో అక్రమ ప్లాట్లు

స్వప్న రెడ్డి Jun 27, 2026 5:12 AM నల్గొండ 1 viewsabout 2 hours ago
సాగు భూమిలో అక్రమ ప్లాట్లు - Udayam Digital
చింతపల్లి మండలం ఘడియగౌరారంలో అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిని వెంచర్లుగా మార్చి ప్లాట్ల దందా చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన ఈ అక్రమ వెంచర్‌పై అధికారులు నోటీసులతోనే సరిపెట్టడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ స్థలాలను కూడా ఆక్రమిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ అక్రమ ప్లాట్ల విక్రయాలను అరికట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...