Back to feed
బీమా సొమ్ము కోసం భర్త హత్య
Rahul Jun 11, 2026 6:15 AM నిజామాబాద్ 7 views4 days ago

కామారెడ్డి జిల్లా మర్కల్లో బీమా సొమ్ము, వివాహేతర సంబంధం కోసం భర్త రాజయ్యను భార్య రేణుక తన ప్రియుడు గంగాశేఖర్తో కలిసి హత్య చేయించింది. మద్యం తాగించి ఐరన్ రాడ్డుతో తలపై కొట్టి చంపిన అనంతరం, దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
జంతువు అడ్డురావడం వల్లే ప్రమాదం జరిగిందని భార్య ఫిర్యాదు చేయగా, పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాల సహాయంతో కేసు ఛేదించిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...



