Back to feed
జిల్లాలో ఇళ్ల గణన పూర్తి
Nidhi Jun 11, 2026 5:49 AM ఖమ్మం 6 views4 days ago

ఖమ్మం జిల్లాలో తొలిదశ జనగణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. మే 11 నుండి ఈ నెల 9 వరకు జరిగిన ఈ సర్వేలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,19,149 నివాస, వాణిజ్య భవనాలను అధికారులు గుర్తించారు.
ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లా జనాభా 14 లక్షల నుండి 18 లక్షలకు పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పల్లెల నుండి పట్టణాలకు వలసలు పెరిగాయని తేలింది. తుది జనాభా లెక్కలను 2027 ఫిబ్రవరిలో సేకరిస్తారు.
Comments
Loading comments...



