Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లార్డ్స్‌లో భారత మహిళల చారిత్రక విజయం

సతీష్ కుమార్ Jul 14, 2026 6:25 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
లార్డ్స్‌లో భారత మహిళల చారిత్రక విజయం - Udayam Digital
లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే ఆలౌటైంది. చివరిరోజు ఆటలో ఇంగ్లండ్ కేవలం 56 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్‌కు ఈ చిరస్మరణీయ విజయం దక్కింది.

Comments

G
Loading comments...