Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణలో ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్

Vikram Chandra May 28, 2026 10:34 AM హైదరాబాద్ 1 views40 minutes ago
తెలంగాణలో ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ - Udayam Digital
తెలంగాణలోని ప్రతి గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భారత్‌నెట్ ప్రోగ్రాం కింద టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో చర్చించారు. నిధుల విడుదల, ఒప్పందాలపై వీరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి దశలో 3,089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి ఇది కీలక మలుపు కానుంది.

Comments

G
Loading comments...