Back to feed
ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ భరోసా
Ravish Kumar May 28, 2026 11:10 AM అల్ ఇండియా 3 views40 minutes ago

రాష్ట్రంలో పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిన్నా, తడిసిన ధాన్యానికి సైతం ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే యాసంగిలో రైతుల ఖాతాల్లో రూ. 11 వేల కోట్లు జమ చేశామని మంత్రి వెల్లడించారు.
కేంద్రం సహకరించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 16,470 కోట్లు వెచ్చించి ధాన్యం సేకరిస్తోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దని రైతులకు భరోసా కల్పించారు.
Comments
Loading comments...
