Back to feed
హైడ్రా కమిషనర్పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి
Rahul Pandey Jun 10, 2026 12:50 PM హైదరాబాద్ 25 views5 days ago

కోర్టు ధిక్కరణ కేసులో వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడం ఆయన నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని, కోర్టు ఆదేశాలను విస్మరిస్తే కెరీర్పై ప్రభావం పడుతుందని న్యాయస్థానం హెచ్చరించింది.
హైకోర్టు ఆదేశించినా 20 రోజుల వరకు బోర్డు ఎందుకు తొలగించలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం మధ్యాహ్నం న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేయడంతో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపునిస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Loading comments...



