Back to feed
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల రెన్యువల్పై హైకోర్టు ఆగ్రహం
Arvind Singh May 22, 2026 6:40 AM హైదరాబాద్ 12 views6 days ago

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల రెన్యువల్ మరియు జీవో 252పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. కార్డుల జారీలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించిన ధర్మాసనం, ఇది మొత్తం జర్నలిస్టుల సమాజ సమస్య అని పేర్కొంది. పదేపదే గడువు పొడిగింపుపై అసహనం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం ప్రస్తుత కార్డుల గడువును జూన్ 16 వరకు పొడిగిస్తామని తెలపడంతో, కోర్టు తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది.
Comments
Loading comments...



