వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలో ఒక మహిళ తన స్థలంలో గుప్తనిధుల కోసం రాత్రిపూట తవ్వకాలు జరుపుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా షెడ్లు వేసి మరీ గుంతలు తవ్వుతున్నారని వారు తెలిపారు.
శనివారం స్థానికులు నిలదీయడంతో ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అక్రమ తవ్వకాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Loading comments...

