Back to feed
కుర్చీ ఆమెది.. పెత్తనం వారిదే
Harika Jun 12, 2026 6:40 AM ఆదిలాబాద్ 7 views3 days ago

రాజకీయాల్లో మహిళా సాధికారత కోసం 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి, వారి భర్తలు లేదా కుమారులు అధికారుల సమావేశాల్లో పాల్గొంటూ, పాలనా వ్యవహారాల్లో పెత్తనం చెలాయిస్తున్నారు.
కొన్ని చోట్ల నిధుల దుర్వినియోగం కూడా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోసిని పంచాయతీలో ఇలాంటి ఉదంతంపై ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ 'కుటుంబ పాలన'ను అరికట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...



