Back to feed
ధాన్యం కొనుగోళ్లపై హరీశ్రావు డిమాండ్
Ravi Shukla May 27, 2026 10:02 AM హైదరాబాద్ 15 viewsabout 10 hours ago

చిన్నకోడూరు మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే పంట తడిసి ముద్దయిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు బాధ్యతలు విస్మరించి రైతులను మోసం చేస్తున్నాయని, ఆంక్షలు లేకుండా ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...



