Back to feed
మహిళను తుపాకీతో కాల్చిన దుండగులు
Sonia Singh Jun 07, 2026 7:54 PM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ పరిధిలో (నివారి మోడ్ వద్ద) పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని, ముసుగులు ధరించి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు జరిపారు.
బుల్లెట్ తగలడంతో బాధితురాలు రక్తపు మడుగులో కుప్పకూలిపోగా.. నిందితులు క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరగడంతో, చుట్టుపక్కల ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...


