Back to feed
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ, కోడింగ్ పాఠాలు
Ravi Shukla Jun 01, 2026 4:25 AM హైదరాబాద్ 9 viewsabout 1 hour ago

రాష్ట్రంలోని 9 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కృత్రిమ మేధ (AI), డిజిటల్ అక్షరాస్యత, కోడింగ్ అంశాలను నేర్పించనున్నారు. డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు వీరికి మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు.
జేఎన్టీయూ ప్రొఫెసర్ కామాక్షి ప్రసాద్ రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలతో, ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంచేలా కంప్యూటర్ల ద్వారా ఈ శిక్షణ అందించనున్నారు.
Comments
Loading comments...



