Back to feed
నిజాంపూర్లో ఇసుక దందా: అనుమతులేవీ?
Rohit Sharma Jun 01, 2026 4:54 AM నిజామాబాద్ 5 viewsabout 1 hour ago

నిజాంపూర్ వాగులో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
స్థానిక అధికారులు చోద్యం చూస్తుండటంతో అక్రమార్కుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించి, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...


