Back to feed
ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు
Ritika Sharma May 27, 2026 6:24 AM హైదరాబాద్ 8 viewsabout 13 hours ago

తెలంగాణలో పంచాయతీ సిబ్బందితో సహా అన్ని శాఖల శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే ఒకేసారి జీతాలు అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఐఏఎస్ అధికారుల తరహాలోనే వీరికీ వేతనాలు అందాలని స్పష్టం చేశారు.
చేయూత పెన్షన్ల సొమ్మును ఇకపై పోస్టాఫీసుల ద్వారా కాకుండా నేరుగా లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించారు. కొత్త పింఛన్ల మంజూరులో ఒంటరి మహిళలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని సీఎం తెలిపారు.
Comments
Loading comments...



