Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిబంధనలు మార్చిన ప్రభుత్వం

lokesh Jun 11, 2026 9:46 AM హైదరాబాద్ 8 views4 days ago
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిబంధనలు మార్చిన ప్రభుత్వం - Udayam Digital
రాష్ట్ర ప్రభుత్వం పోస్టుమెట్రిక్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాల విధానంలో కీలక మార్పులు చేసింది. విద్యార్థులు మధ్యలో చదువు ఆపేస్తే, వారికి చెల్లించిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే అధికారాన్ని సంక్షేమ శాఖలకు కల్పించింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా దీనికి అర్హులేనని స్పష్టం చేసింది. అయితే విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదా స్టైపెండ్‌లలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. అదనపు డిగ్రీలకు స్కాలర్‌షిప్‌లు వర్తించవు.

Comments

G
Loading comments...