Back to feed
సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్ధరణ
Rohit Jun 13, 2026 5:07 AM హైదరాబాద్ 9 views2 days ago

సింగరేణిలో నిలిచిపోయిన మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క యాజమాన్యాన్ని ఆదేశించారు. అర్హులైన కార్మికుల వారసులకు పారదర్శకంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రక్రియను వివాదరహితంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
ఈ క్రమంలోనే అర్హులైన 335 మంది వారసులకు శనివారం నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మారుపేర్ల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసానిచ్చారు.
Comments
Loading comments...



