Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడి వేధింపులకు యువతి బలి

Follow Udayam on Google
Nidhi Razdan Jun 07, 2026 10:19 AM హైదరాబాద్General
ప్రియుడి వేధింపులకు యువతి బలి - Udayam
హైదరాబాద్ నానక్‌రాంగూడలో టెలీకాలర్‌గా పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మొల్లి దుర్గ(23), తన ప్రియుడు సాయి కుమార్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే, ప్రియుడు ఆమెపై అనుమానంతో కొద్ది రోజులుగా తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి సాయి కుమార్ మద్యం తాగి గొడవ పడటంతో, మనస్తాపం చెందిన దుర్గ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మేనమామ ఫిర్యాదుతో పోలీసులు సాయి కుమార్‌ను అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...