Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిద్రలోనే కూలర్ రూపంలో వచ్చిన మృత్యువు.. బాలుడి మృతి!

Follow Udayam on Google
Priya Singh Jun 07, 2026 12:35 PM ఆదిలాబాద్General
నిద్రలోనే కూలర్ రూపంలో వచ్చిన మృత్యువు.. బాలుడి మృతి! - Udayam
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలో శనివారం రాత్రి ఘోరం జరిగింది. ఏడేళ్ల ఆడే ధీరజ్ అనే బాలుడు నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తూ అతని కాలు కూలర్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...