Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నిద్రలోనే కూలర్ రూపంలో వచ్చిన మృత్యువు.. బాలుడి మృతి!

Priya Singh Jun 07, 2026 7:05 AM ఆదిలాబాద్ 4 viewsabout 2 hours ago
నిద్రలోనే కూలర్ రూపంలో వచ్చిన మృత్యువు.. బాలుడి మృతి! - Udayam Digital
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలో శనివారం రాత్రి ఘోరం జరిగింది. ఏడేళ్ల ఆడే ధీరజ్ అనే బాలుడు నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తూ అతని కాలు కూలర్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...