వార్తలకు తిరిగి వెళ్లండి

గజియాబాద్లో బక్రీద్ రోజున 17 ఏళ్ల సూర్య ప్రతాప్ చౌహాన్ను కత్తితో పొడిచి చంపిన కేసులో ప్రధాన నిందితుడు అసద్ను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. పరారీలో ఉన్న అసద్పై రూ.50 వేల రివార్డు ఉంది. శనివారం రాత్రి పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారికి కూడా గాయాలయ్యాయి.
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. కాగా, తన కొడుకును చంపిన మిగతా నిందితులను కూడా ఎన్కౌంటర్ చేయాలని, వారి ఇళ్లను కూల్చివేయాలని బాధితుడి తల్లి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

