వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని పెరియపాలెం రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో అమోనియా గ్యాస్ లీకై ఏడుగురు మహిళా కార్మికులు మరణించారు. మరో 67 మంది తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. విషమంగా ఉన్న తొమ్మిది మందిని మెరుగైన వైద్యం కోసం స్టాన్లీ మెడికల్ కాలేజీకి తరలించినట్లు జిల్లా కలెక్టర్ కవిత వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...

