వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్లో అంత్యక్రియల దందా
విక్రాంత్ రెడ్డి Jun 27, 2026 4:42 AM కరీంనగర్ 1 viewsabout 2 hours ago

కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘రూపాయికే అంత్యక్రియలు’ పథకంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల వారి ఆధార్ కార్డులను సేకరించి, అధికారులు, కాంట్రాక్టర్లు మిలాఖత్ అయి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.
పథకం ప్రకారం అందాల్సిన సదుపాయాలను అందించకుండా, బాధిత కుటుంబాల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...