Back to feed
ఇంధన ధరల మోత: గిగ్ కార్మికులకు కష్టాల గండం
Priya Singh May 26, 2026 5:01 AM హైదరాబాద్ 18 views1 day ago

నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో సామాన్యుడిపై రోజుకు రూ.2.55 కోట్ల భారం పడుతోంది. లీటరు పెట్రోల్ రూ.115.69కి చేరుకోవడంతో వాహనదారుల జేబులకు చిల్లు పడుతోంది. పది రోజుల్లోనే భారీగా పెరిగిన ధరలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ముఖ్యంగా 4 లక్షల మంది గిగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్ సంస్థలు కమీషన్లు వసూలు చేస్తూనే, డ్రైవర్లకు సరైన వేతనాలు ఇవ్వడం లేదు. పెరిగిన ఇంధన ఖర్చులు, అగ్రిగేటర్ల దోపిడీతో కార్మికుల సంపాదన ఆవిరవుతోంది.
Comments
Loading comments...



