Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

వాహనదారులకు చమురు సెగ: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Vikram Sharma May 19, 2026 4:49 AM అల్ ఇండియా 2 views9 days ago
వాహనదారులకు చమురు సెగ: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! - Udayam Digital
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై ఒత్తిడి పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు ఇంధనంపై చమురు సంస్థలు దాదాపు 90 పైసలు పెంచాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది రెండోసారి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.88 కి చేరగా, డీజిల్ ధర రూ.99.95 కి పెరిగింది. ధరల నియంత్రణకు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగా నిలిపివేసినా ఈ బాదుడు తప్పలేదు.

Comments

G
Loading comments...