Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

Sonia Jun 11, 2026 6:17 AM కామరెడ్డి 7 views4 days ago
కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం - Udayam Digital
కామారెడ్డి పట్టణంలో తల్లి లయ (31) తన ముగ్గురు పిల్లలతో కలిసి ఒకేసారి అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. కనిపించకుండా పోయిన వారిలో 16 ఏళ్ల బిందు, 13 ఏళ్ల శివ, 8 ఏళ్ల దివిజ ఉన్నారు. బాధితులు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల వల్లే వారు ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...