Back to feed
సిమ్స్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
Harika Jun 13, 2026 12:56 PM పెద్దపల్లి 18 views2 days ago

గోదావరిఖనిలోని సిమ్స్ వైద్య కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు. సెమిస్టర్ పరీక్షలు ముగిసిన వేడుకలో భాగంగా ఒక హోటల్లో మండీ బిర్యానీ తిన్న విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతరం విద్యార్థులందరూ కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. హోటళ్లలో నాణ్యతను తనిఖీ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...



