వార్తలకు తిరిగి వెళ్లండి
బంగ్లాదేశ్ను ముంచెత్తిన వరదలు

బంగ్లాదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఢాకాతో పాటు ఏడు జిల్లాల్లో సుమారు 10 లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొండచరియలు విరిగిపడటంతో వేలాది ఇళ్లు కూలిపోగా, బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
Comments
Loading comments...