Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈడీ చరిత్రలో తొలిసారి: వేలంలో అమ్ముడైన విమానం!

కౌశిక్ శర్మ Jul 03, 2026 11:30 AM హైదరాబాద్ 5 viewsabout 3 hours ago
ఈడీ చరిత్రలో తొలిసారి: వేలంలో అమ్ముడైన విమానం! - Udayam Digital
దేశంలోనే తొలిసారిగా ఒక విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) ఈ-వేలంలో విక్రయించింది. హైదరాబాద్‌ జోనల్‌ ఈడీ స్వాధీనం చేసుకున్న హాకర్‌ 800ఎ విమానాన్ని ఎంఎస్‌టీసీ ద్వారా విజయవంతంగా అమ్మేశారు. రూ.792 కోట్ల ఫాల్కన్ పోంజీ మోసానికి పాల్పడిన నిందితుడు అమర్‌దీప్‌ కుమార్ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దీనిని స్వాధీనం చేసుకున్నారు. వేలం ద్వారా వచ్చిన రూ.3 కోట్లను బాధితులకు అందజేయనున్నారు.

Comments

G
Loading comments...