వార్తలకు తిరిగి వెళ్లండి
100% సబ్సిడీతో పత్తి విత్తనాల పంపిణీ

గట్టుప్పల్లో 'పత్తి ఉత్పాదకత మిషన్' కింద రైతులకు శుక్రవారం 100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. సాగు వ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందిస్తోందని వ్యవసాయ అధికారిణి రేవతి తెలిపారు.
ఈ విత్తనాలను నిర్ణీత విధానంలో సాగు చేయాలని, పంటను జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...