Back to feed
తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్
Arjun Pandey May 27, 2026 5:35 AM అల్ ఇండియా 11 viewsabout 14 hours ago

దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రవేశపెట్టేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీ డివిజన్లోని జింద్-సోనిపట్ మార్గంలో 10 కోచ్లతో నడిచే ఈ రైలు గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది.
ఇటీవలే ఆర్డీఎస్ఓ ఆధ్వర్యంలో ఈ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. పర్యావరణహితమైన ఈ వినూత్న హైడ్రోజన్ రైలు త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది.
Comments
Loading comments...


