Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

శ్రీకాకుళంలో భారీ అగ్ని ప్రమాదం: రూ. 1.50 కోట్ల నష్టం

Kumar Jun 19, 2026 10:34 AM శ్రీకాకుళం 7 viewsabout 3 hours ago
శ్రీకాకుళంలో భారీ అగ్ని ప్రమాదం: రూ. 1.50 కోట్ల నష్టం - Udayam Digital
శ్రీకాకుళం జిల్లా కవిటి తీరంలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 8 మత్స్యకార కుటుంబాల బోట్లు, వలలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 1.50 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. జీవనాధారాన్ని కోల్పోయిన మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఆర్థిక సాయం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారని వారు ఆవేదన చెందారు.

Comments

G
Loading comments...