Back to feed
ఫైనల్లో భారత్-ఎ
Sonia Singh Jun 18, 2026 5:06 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

ముక్కోణపు టోర్నీలో చావోరేవో పోరులో అదరగొట్టిన ఇండియా-ఎ జట్టు 101 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్-ఎను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన తిలక్వర్మ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ప్రియాంశ్, తిలక్, కుశాగ్ర అర్ధసెంచరీలతో రాణించగా.. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 218 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ నిశాంత్ సింధు 4 వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
Comments
Loading comments...



