Back to feed
కొడుకుకు ఈత నేర్పిస్తూ తండ్రి మృతి
Rajdeep Sardesai May 30, 2026 6:17 AM కామరెడ్డి 14 viewsabout 13 hours ago

కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లిలోని స్విమ్మింగ్ పూల్లో కుమారుడికి ఈత నేర్పిస్తున్న క్రమంలో చింతకింది శ్రీనివాస్ (43) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. శ్రీనివాస్కు ఈత సరిగ్గా రాకపోవడమే ఈ విషాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
అక్కడున్న వారు అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. వైద్యులు పరీక్షించి శ్రీనివాస్ అప్పటికే మరణించాడని ధృవీకరించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...


