వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను విస్మరించిందని హరీశ్రావు విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ రైతుబంధు అందించారని, నేడు అధికారం మత్తులో ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రూ.20 వేల కోట్ల నిధులను ఎగ్గొట్టి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్ల పంపిణీలోనూ వైఫల్యం చెందారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలు హిట్లర్ పాలనను అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు.
Comments
Loading comments...

