Back to feed
తిరుమలపురంలో రైతుల ఆందోళన
Vikram Sharma Jun 01, 2026 12:10 PM కరీంనగర్ 4 viewsabout 1 hour ago

రామడుగు మండలం తిరుమలపురం వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో, ఎండలకు 60 శాతం వడ్లు ఎండిపోయి బరువు తగ్గుతున్నాయని వారు వాపోయారు.
క్వింటాల్కు 10 కేజీల కోత మరియు తూకంలో మోసం జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి లారీలను పంపి కొనుగోళ్లు పూర్తి చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...



