వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, రవాణా జాప్యం వల్ల ఖర్చులు పెరిగి మద్దతు ధర దక్కడం లేదు. దీంతో విసిగిపోయిన రైతులు నష్టానికైనా దళారులకే పంటను విక్రయిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, గోదాముల కొరతతో గద్వాల మార్కెట్లో ధాన్యం పేరుకుపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలు రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. పాలకుల ఉదాసీనత వల్ల అన్నదాతల పరిస్థితి దైన్యంగా మారింది.
Comments
Loading comments...

