వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లలో విఫలమై, వానకాలం విత్తనాలు, ఎరువులు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయం నేడు దుస్థితికి చేరిందని, నియోజకవర్గంలో కరెంటు, ఎరువుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
స్థానిక ఎమ్మెల్యే రైతుల కష్టాలను విస్మరించి జన్మదిన వేడుకల్లో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. ఈ నెల 16న మానకొండూర్లో నిర్వహించే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హరీశ్రావు, జీవన్రెడ్డి హాజరుకానున్నారని, కార్యకర్తలు భారీగా తరలిరావాలని రసమయి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

