వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుల ఖాతాల్లోకి వేల కోట్లు.. సర్కార్ కీలక నిర్ణయం

రైతు భరోసా కింద ప్రభుత్వం నాలుగో విడత నిధులను విడుదల చేసింది. ఐదు ఎకరాల లోపు సాగుభూమి కలిగిన 4.41 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1,188 కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతులకు రూ.6,590.37 కోట్లు అందించినట్లు మంత్రి వివరించారు. అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరిందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...