Back to feed
కరెంట్ తీగ తెగిపడి రైతు దుర్మరణం!
Harika Jun 15, 2026 7:23 AM మెదక్ 6 viewsabout 3 hours ago

మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగంతంలో వరి నారుమడి సిద్ధం చేస్తుండగా తెగిపడిన కరెంట్ తీగలు తగిలి కురుమ పోచయ్య (51) అనే రైతు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘోర ప్రమాదంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...



