Back to feed
వైఎస్సార్పై తప్పుడు ప్రచారం: షర్మిల
Sonia Singh May 27, 2026 7:26 AM అమరావతి 5 viewsabout 12 hours ago

కూటమి ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చనిపోయిన వైఎస్సార్, రాజారెడ్డిలపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
వైఎస్సార్ కాలంలోనే ఉచిత కరెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి మంచి పథకాలు వచ్చాయని ఆమె గుర్తుచేశారు. చంద్రబాబు రెండుసార్లు సీఎం అయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని షర్మిల మండిపడ్డారు.
Comments
Loading comments...



