వార్తలకు తిరిగి వెళ్లండి
నియంత్రణ రేఖ వద్ద పేలుడు: ఒకరు మృతి, నలుగురికి గాయాలు
రూపేష్ గౌడ్ Jun 27, 2026 2:08 PM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లా, నియంత్రణ రేఖ (LOC) సమీపంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. గుల్మార్గ్ ప్రాంతంలోని ‘ఆశా పోస్ట్’ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడిని జాబిర్ అహ్మద్గా గుర్తించి, క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
పాత బాంబు షెల్ను తాకడం వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...